అమరావతిలో కూలీల కొరత నిజమేనా?
అమరావతిలో కూలీల కొరత నిజమేనా?
ప్రచురణ
అమరావతిలో కూలీల కొరత ఉందా? ఎంత మంది అవసరం? ఎంతమంది పనిలో ఉన్నారు? ప్రభుత్వం ఏమంటోంది?
ప్రభుత్వం చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులకు 22 వేల నుంచి 23 వేల మంది కూలీలు అవసరమని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో 13వేల మంది కూలీలు పనుల్లో ఉన్నారని సీఐటీయూ రాజధాని డివిజన్ కన్వీనర్ రవి అంటున్నారు.
ఇప్పటికి కూడా దాదాపుగా 20వేలమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ మూర్తి తెలిపారు. ఇక్కడి పనులకు స్థానిక కార్మికులు పెద్దసంఖ్యలో రావడం లేదనీ, వలస కార్మికులకు అవకాశం కల్పించాల్సి వస్తోందని మూర్తి చెప్పారు.




